03/08/2025
👇రాష్ట్ర ఉత్తమ టీచర్ అవార్డులకు దరఖాస్తులు👇
👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు శుక్రవారం (ఆగస్ట్ 1) నుంచి ఈ నెల 8 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డివిజన్ స్థాయిలో 11న పరిశీలించి ఒక్కో కేటగిరీకి ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తారు. ఆ జాబితాను జిల్లా విద్యాధికారికి 12న అందిస్తారు. ఒక్కో కేటగిరీకి ఒకరు చొప్పున తుది జాబితాను...14న జిల్లా స్థాయి కమిటీలో రూపొందిస్తారు. దీన్ని 16న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో 21 నుంచి 23 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది జాబితాను 25న ఖరారు చేస్తారు. ఎంపికైన వారికి సెప్టెంబరు 5న రూ.20వేల నగదు, ప్రశంస పత్రం, పతకం అందిస్తారు. జిల్లా స్థాయిలో 30 మంది, మండల స్థాయిలో 10 మందికి మించకుండా అవార్డులకు ఎంపిక చేయాలని డైరెక్టరేట్ ఆదేశించింది.
👉 ఉత్తమ పని తీరు కనబరిచిన ఉపాధ్యాయులకు ఉత్తమ టీచర్ అవార్డు ఇస్తారు. ఇందుకోసం జిల్లాకు 16 మంది చొప్పున రాష్ట్ర స్థాయిలోనే ఎంపిక చేసి, ఆ జాబితాను జిల్లాకు పంపిస్తారు. అక్కడ పరిశీలించి తిరిగి రాష్ట్ర స్థాయికి పంపించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూల తర్వాత 104 మందిని ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు చేయకపోయినా ఉత్తమ టీచర్ తరఫున ఎవరైనా ఈ అవార్డుకు ఐదుగురు టీచర్లు సిఫార్సు చేసేందుకు అవకాశం కల్పించారు.